చండీఘడ్: పంజాబ్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయి. రాజకీయ సమావేశాలపైన కూడా పంజాబ్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. అంత్యక్రియలు, పెండ్లిళ్లు, దహన సంస్కారాలకు కూడా ఆంక్షలు విధించారు. ఇండోర్ ఫంక్షన్లకు 50 మంది, ఔట్డోర్ కార్యక్రమాలకు వంద మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.