న్యూఢిల్లీ, మే 19: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వీరిచేత ప్రమాణం చేయించారు. వీరిద్దరి రాకతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరుకుంది. దీంతో ఇక సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలన్నీ భర్తీ అయినట్టే. అయితే వచ్చే నెలలో ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు.