తాండూర్, ఏప్రిల్ 1: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడువలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ఇంటి వద్దకే వచ్చి మ్యుటేషన్ చేశారు తాసిల్దార్. మంచిర్యాల జిల్లా తాండూర్కు చెందిన జాడి పోశం.. తన తండ్రి నుంచి 1.31ఎకరాల భూమిని కొద్దిరోజుల క్రితం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత పోశం ప్రమాదం బారిన పడటంతో హైదరాబాద్లో చికిత్సపొంది, మూడు రోజుల క్రితం తాండూర్ వచ్చారు. బుధవారం మ్యుటేషన్ కోసం స్లాట్బుక్ చేసినా వెళ్లలేదు. పోశం పరిస్థితిని తెలుసుకున్న తాసిల్దార్ కవిత, ధరణి ఆపరేటర్ రాకేశ్, వీఆర్ఏ వేణు ఆయన ఇంటికి వెళ్లారు. ఫొటో, వేలి ముద్రలు సేకరించారు. అనంతరం ఆ భూమిని పోశం పేరు మీద మ్యుటేషన్ చేసి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు.