న్యూఢిల్లీ : భారత రక్షణ రంగం ఆధునిక యుద్ధ కార్యకలాపాల కోసం మొదటి ‘ఫ్లయింగ్ డ్రోన్స్ క్యారియర్’ను ఎండ్యూర్ ఎయిర్, ‘బిఈఎల్’లతో కలసి ‘వాహక్-6’ను అభివృద్ధి చేసింది. ఇది భారత సైన్యం పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. ‘సబల్-20’, మదర్షిప్, ‘అలఖ్’ మైక్రో-డ్రోన్లతో కూడిన ఈ రెండంచెల వ్యవస్థ జీపీఎస్ నిలిపివేసిన వాతావరణంలో కూడా అధునాతన నిఘా, ఎదురుదాడి మిషన్లను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
ప్రభుత్వరంగ సంస్థ బీఈఎల్, ఒక ప్రైవేటు సంస్థ సంయుక్తంగా దేశపు మొట్టమొదటి స్వీదేశీ యూఏవీ మదర్షిప్ను అభివృద్ధి చేశాయి. ఇది రెండంచెల మానవ రహిత వైమానిక వ్యవస్థ(యూఏఎస్). ఇది ‘సబల్-20 అనే పెద్ద హెలికాప్టర్ వంటి మదర్షిప్ను కలిగి ఉంటుంది. ఇది ‘అలఖ్’ అని పిలిచే చిన్న మైక్రో డ్రోన్లను మోసుకెళ్తుంది. సుదూర లక్ష్యాల కోసం డ్రోన్లను ఉపయోగించడం వల్ల పరిమిత బ్యాటరీ వంటి సమస్యలు ఎదురవుతాయి.