న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 58,378 కోట్ల నికర అదనపు వ్యయం (Additional Spending) కోసం లోక్సభ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదనపు గ్రాంట్ల కోసం తొలి అనుబంధ డిమాండ్లను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సభలో బుధవారం ప్రవేశపెట్టారు. గ్రాంట్ల కోసం ప్రవేశపెట్టిన అనుబంధ డిమాండ్లలో రూ. 1.29 లక్షల కోట్లకు పైగా స్థూల అదనపు వ్యయం ఉంది. ఇందులో రూ.70,968 కోట్ల పొదుపును కూడా చూపించారు. దీంతో నికర అదనపు వ్యయం మొత్తం రూ. 58,378.21 కోట్లకు చేరిందని కేంద్రం తెలిపింది. అదనపు వ్యయంలో ఎరువుల సబ్సిడీకి రూ.13,351 కోట్లు వినియోగించనున్నట్లు వెల్లడించింది. లోక్సభలో సమర్పించిన పత్రంలో ఈ మేరకు పేర్కొంది.