న్యూఢిల్లీ, మే 12: దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతు పవనాలు ఈ వారం చివరినాటికి బంగాళాఖాతం , అండమాన్, నికోబార్ సమీప ద్వీపాలకు చేరుకుంటాయని తెలిపింది. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. సాధారణంగా మే 20 నాటికి అండమాన్, నికోబార్ దీవులకు చేరుకుంటాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. జూన్ 1న కేరళను తాకుతాయి. భారత ఉపఖండంలో నాలుగు నెలల వర్షాకాలం ప్రారంభానికి దీనిని సూచికగా భావిస్తారు.