గడ్చిరోలి, మే 16: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మొత్తం రూ.38 లక్షల రివార్డ్ ఉన్న ఐదుగురు నక్సలైట్లు శనివారం లొంగిపోయారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు నిఘా ఆధారిత వరుస ఆపరేషన్లలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్కు చెందిన 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ ప్రారంభించిన తర్వాత తమ అధికారిక వాంటెడ్ రికార్డుల్లో ఇప్పుడు ఏ మావోయిస్టు కూడా లేడని గడ్చిరోలి పోలీసులు చెప్పారు.
మే 13, 14 తేదీల్లో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 8 మంది నక్సల్స్ని సంయుక్త దళాలు అరెస్టు చేశాయి. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలతోపాటు గుడెనూర్ అటవీ ప్రాంతంలోని ఒక రహస్య డంప్ నుంచి రూ.63.84 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గడ్చిరోలి పోలీసుల ఎదుట మొత్తం 819 మంది మావోయిస్టులు లొంగిపోయారు.