న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలోకి ఈ ఏడాది వడ్డీ(PF Interest)ని జమ చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి పీఎఫ్ వడ్డీని 8.15 శాతంగా ఫిక్స్ చేశారు. ఇప్పటికే కొందరు పీఎఫ్ అకౌంట్ యూజర్లకు ఇంట్రెస్ట్ జమా అయ్యింది. అయితే ఆ అకౌంట్లలో అమౌంట్ కనిపించేందుకు కొంత సమయం పడుతుందని ఈపీఎఫ్వో తెలిపింది. వడ్డీ జమా అయిన తర్వాత మొత్తం అమౌంట్ చెల్లించనున్నట్లు ఈపీఎఫ్వో వెల్లడించింది. దాదాపు 24 కోట్ల అకౌంట్లలో పీఎఫ్ వడ్డీని క్రెడిట్ చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈపీఎఫ్వోలోని సీబీటీ ప్రతి ఏడాది పీఎఫ్ వడ్డీని నిర్ణయిస్తుంది. కేంద్ర ఆర్థికశాఖ సహాకారంతో ఆ అమౌంట్ తేలుస్తారు.