పుణె, ఆగస్టు 11: మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ కారును తయారు చేశారు. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను నివారించడం కోసం కృత్రిమ మేధ సాయంతో దీనిని అభివృద్ధి చేశారు. ఇది లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీతో పనిచేస్తుంది. పూర్తిగా చార్జింగ్ కావడానికి నాలుగు గంటలు పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎయిర్పోర్టులు, మెట్రోస్టేషన్లు, గోల్ఫ్ క్లబ్బులు, యూనివర్శిటీలు తదితర చోట్ల ఈ కారు ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు.