ముంబై: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 10 గంటల వరకు ఎర్లీ ట్రెండ్స్పై స్పష్టత వచ్చింది. మొత్తం 250 వార్డులకుగాను ఆమ్ఆద్మీ పార్టీ 109 వార్డుల్లో, బీజేపీ 105 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కేవలం 9 వార్డుల్లో ఆధిక్యత కనబరుస్తున్నది. మిగతా వార్డుల్లో ఇండిపెండెంట్స్ ఆధిక్యంలో ఉన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది. ఢిల్లీలో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉన్నా.. ఢిల్లీ కార్పోరేషన్లో మాత్రం బీజేపీ గెలుస్తూ వచ్చింది. కానీ, ఈసారి అందుకు భిన్నంగా ఢిల్లీ వాసులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఢిల్లీ కార్పోరేషన్లో ఆప్ దే విజయమని స్పష్టంచేశాయి.