న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మంత్రివర్గం శుభవార్త వినిపించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం ( DA ) పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెంచిన డీఏ 2021, జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. డీఏ కోసం గత కొద్ది నెలల నుంచి ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్రం నిర్ణయం ఎంతో ఊరటనిచ్చింది.