ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ నియమితులయ్యారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ అసెంబ్లీలో సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద పార్టీ ఎన్సీపీ అని పేర్కొన్నారు. కాగా, ఎన్సీపీ శాసనసభా పక్ష నేత జయంత్ పాటిల్ ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ పేరును ప్రతిపాదించారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ‘మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అజిత్ పవార్ పేరును ఎన్సీపీ శాసనసభా పక్ష నేత జయంత్ పాటిల్ ప్రతిపాదించారు. దానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది’ అని అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం ఏక్నాథ్ షిండే నెగ్గారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆయనకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఓటింగ్లో ప్రతిపక్షానికి 99 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు. మెజారిటీ మార్క్ 144 మాత్రమే. అయితే నిన్నటి వరకు ఉద్ధవ్ గ్యాంగ్తో ఉన్న ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ఇవాళ బలపరీక్షలో ఏక్నాథ్కు సపోర్ట్ ఇచ్చారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.