న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఇద్దరు జాలర్ల హత్య విషయంలో ఇటలీ మెరైన్స్కు చెందిన ఇద్దరిపై ఉన్న క్రిమినల్ కేసును ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ కేసును మూసివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 2012 ఫిబ్రవరిలో కేరళ తీరంలో ఇద్దరు మత్స్యకారులను ఇటలీ నావికులు హత్య చేసినట్లు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఇటలీ చేపట్టాలని తన ఆదేశాల్లో సుప్రీం పేర్కన్నది. ఇద్దరు మత్స్యకారులకు కుటుంబాలకు చెరో నాలుగు కోట్లు డిపాజిట్ చేయాలని, బోటు ఓనర్కు మరో రెండు కోట్లు ఇవ్వాలని ఇటలీని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. అంతర్జాతీయ కోర్టు ప్రకారం ఈ కేసులో తదుపరి విచారణ ఇటలీ చేపట్టాలని సుప్రీం తెలిపింది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో చేపలు పడుతున్న ఇద్దరు భారతీయ జాలర్లను ఎంవీ ఎన్రికా లెక్సీ ట్యాంకర్ నౌకలో ఉన్న మెరైన్లు చంపేశారు. ఈ ఘటన 2012లో జరిగింది.