Jayashankar
- Jan 18, 2021 , 04:44:19
VIDEOS
‘రామ మందిర నిర్మాణానికి నిధి సమర్పించండి ’

కృష్ణకాలనీ, జనవరి 17 : అయోధ్యలో నిర్మించే రామ మందిరానికి జిల్లాలోని హిందువులు టోకెన్ల ద్వారా తోచినంత నిధి సమర్పించాలని విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దిరెడ్డి మల్లారెడ్డి కోరారు. ఆదివారం సంతోషిమాత ఆలయంలో జిల్లా అధ్యక్షుడు బబ్బిడి దేవరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మందిరం నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతుండడంతో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 20 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో టోకెన్ల ద్వారా నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో రామాచారి, సదయ్య, చక్రపాణి, పునీత్, అల్లం సాగర్, వివేక్, శ్యామ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి
- కాళేశ్వరం చేరుకున్న వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు
MOST READ
TRENDING