బీజింగ్: కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్న చైనా కీలక ప్రకటన చేసింది. సాధారణ వీసాలు, పాస్పోర్టులు జారీ చేయనున్నట్లు ఆ దేశం తెలిపింది. దాదాపు మూడేళ్ల పాటు తీవ్ర ఆంక్షల్లో ఉన్న చైనా.. ఇప్పుడిప్పుడే కొత్త నియమావళిని జారీ చేస్తోంది. వచ్చే నెలలో చైనా కొత్త సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలిస్తున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు జీ జిన్పింగ్ యాంటీ వైరస్ చర్యలకు శ్రీకారం చుట్టారు.
చైనా సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక టూరిస్టు ప్రదేశాల్లో మళ్లీ కిటకిటలాడనున్నాయి. జనవరి 22వ తేదీ నుంచి చైనాలో చంద్రమాణ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ఆ సమయంలో మళ్లీ కోవిడ్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు భయాందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విదేశీయులకు వీసాలు, స్వదేశీయులకు పాస్పోర్ట్లు ఇవ్వడం 2020లోనే చైనా ఆపేసింది. అయితే జనవరి 8వ తేదీ నుంచి పాస్పోర్టుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జాతీయ ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది.
సాధారణ వీసాలు, రెసిడెన్స్ పర్మిట్ల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చైనా తెలిపింది.