కరాచీ, జూన్ 11: గూఢచర్యం ఆరోపణలతో పాక్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ న్యాయ సాయం పొందేందుకు కాన్సులర్ను నియమించుకునే అవకాశాన్ని కల్పించింది పాకిస్థాన్. ఈ మేరకు ఆ దేశం.. జాతీయ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఆయనకు కాన్సులర్ను నియమించుకునే అవకాశం కల్పించాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) 2019లో పాక్కు సూచించింది.