హైదరాబాద్లో ర్యాపిడో బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని హేమదుర్గ(26) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన శ్రీనగర్ కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హేమదుర్గ సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ర్యాపిడో పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లైవ్ క్యామ్ ఫుటేజ్..!
హైదరాబాద్లో ర్యాపిడో బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని 26 ఏళ్ల హేమదుర్గ అనే యువతి అక్కడికక్కడే మృతి
సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ర్యాపిడో పై వెళ్తుండగా శ్రీనగర్ కాలనీలో ఈ ప్రమాదం
బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు pic.twitter.com/2UqI9jrc3C
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026