ఉస్మానియా యూనివర్సిటీ/శామీర్పేట, మే 17: నగరంలోని రెండు ప్రాంతాల్లో బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురిని ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్నగర్ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్చేసి రిమాండ్కు తరలించా రు. వారి నుంచి 10 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్లో నివాసముండే రాహుల్ రాజ్ మొబైల్ షాప్లో పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు రాహుల్రాజ్ను అదుపులోకి తీసుకుని ఆరు ఇంజక్షన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
కాప్రా మండలం భరత్నగర్కు చెందిన తేలు సునీల్కుమార్, శివసాయినగర్కు చెందిన వంశీ బ్లాక్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నా రు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని.. 4 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని జవహర్నగర్ పోలీసులకు అప్పగించారు.