మణికొండ,సెప్టెంబర్ 8 : మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం నార్సింగి మున్సిపాలిటీలో రూ. 2 కోట్ల 40 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. వట్టినాగులపల్లి ఒకటో వార్డులో శ్మశానవాటిక నుంచి చెరువు కట్ట వరకు రూ.40 లక్షల నిధులతో అసంపూర్తిగా ఉన్న వీడిసీసీ రహదారి పనులను , రూ.50లక్షల నిధులతో నార్సింగి జిల్లా పరిషత్ పాఠశాల నుంచి మదర్డెయిరీ ఇండస్ట్రీస్ వరకు వీడీసీసీ రోడ్డు పనులను, కోటి నిధులతో మదర్డెయిరీ నుంచి మసీదు రోడ్డు వరకు వీడీసీసీ రోడ్డు పనులను, మంచిరేవుల గ్రామ పరిధిలోని శ్రీనగర్కాలనీలో రూ.50 లక్షల నిధులతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎ మ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్నివర్గాలను ఆదుకుంటుందన్నారు. నగర శివారు మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేండ్లలోనే అభివృద్ధి సాధి ంచిందన్నారు. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగానే ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖాయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్, మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, కౌన్సిలర్లు యాదమ్మ, పత్తి శ్రీకాంత్,పత్తి ప్రవీణ్కుమార్, శివారెడ్డి, అమరేందర్రెడ్డి, ప్రవళిక కిరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.