‘ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్లే’ అని ప్రతిఒక్కరూ భావిస్తున్న సందర్భమిది. కంటికి కనబడని సూక్ష్మజీవి అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో చక్కని జీవనశైలి అలవర్చుకుంటే చిక్కటి ఆరోగ్యం మన సొంతమవడం ఖాయమని అపోలో దవాఖాన సీనియర్ ఎండోక్రినాలజిస్ట్ రవిశంకర్ ఇరుకులపాటి పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అనేక సూచనలు, సలహాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయని.. దేన్ని పడితే దాన్ని పాటించకుండా నిపుణులు, వైద్యుల సూచనల మేరకు వాటిని పాటించడం శ్రేయస్కరమని అంటున్నారు. కరోనా వ్యాప్తితో మారుతున్న జీవన శైలిపై ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..