చైన్స్నాచర్ను పట్టుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు..
నిందితుడు ఏసీ మెకానిక్
బస్స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును తెంచుకొని పరారయిన స్నాచర్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ అంజనీకుమార్.. వెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్తో కలిసి వివరాలు వెల్లడించా రు. ఈ నెల 21న ఉదయం 7.20 గంటలకు దాదూస్ స్వీట్షాప్ వద్ద ఉన్న బస్స్టాప్ వద్ద బస్సు కోసం అలివేలు అనే మహి ళ ఎదురు చూస్తున్నది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును తెంచుకొని, బైక్పై పరారయ్యాడు.
వెంటనే బాధిత మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా.. నిందితుడి కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించి..ఫిర్యాదు అందిన 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. అతడు మెయినాబాద్ మండలం, టంగుటూర్కు చెందిన శేరిగూడ శివగా గుర్తించారు. ఏసీ మెకానిక్గా పనిచేస్తూ స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు. ఇతడిపై నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు కేసులు నమోదై ఉన్నాయి. 2018, మార్చిలో జైలు నుంచి బయటకు వచ్చి.. ఇటీవల తిరిగి స్నాచింగ్లు చేయడం ప్రారంభించాడు. నిందితుడి నుంచి యాక్టివా, దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి, అదనపు ఇన్స్పెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.