కావలసిన పదార్థాలు
జొన్న పిండి: ఒక కప్పు, బెల్లం: అర కప్పు, పల్లీలు: అర కప్పు, నెయ్యి: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్.
తయారీ విధానం
పల్లీలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో పావుకప్పు నెయ్యి వేసి, వేడయ్యాక జొన్నపిండి జోడించి పచ్చి
వాసన పోయేవరకు సన్నని మంటమీద వేయించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన పల్లీలు, జొన్నపిండి, బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టి ప్లేట్లో తీసుకోవాలి. పిండి మిశ్రమంలో మిగతా నెయ్యి, యాలకుల పొడి జోడించి బాగా కలిపి లడ్డూలు చేసుకుంటే కమ్మటి జొన్న మిఠాయి సిద్ధం.