కావలసిన పదార్థాలు
మైదాపిండి: అర కప్పు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, బ్రెడ్ పొడి: ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము: అర కప్పు, గుడ్లు: రెండు, పచ్చి రొయ్యలు: ఒక కప్పు, మయోనీజ్: అర కప్పు, స్పైసీ చిల్లీ సాస్: ఒక టేబుల్ స్పూన్, థాయ్ స్వీట్ చిల్లీ సాస్: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. మరో గిన్నెలో కొబ్బరి తురుము, బ్రెడ్ పొడి వేసి కలపాలి. మూడో గిన్నెలో గుడ్ల సొన వేయాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఒక్కో రొయ్యను ముందుగా పిండి, తర్వాత కొబ్బరి మిశ్రమం, చివరగా గుడ్డు సొనలో ముంచి పక్కనపెట్టాలి. వాటన్నిటినీ ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో పెట్టి, 400 డిగ్రీల దగ్గర ఉడికించాలి. దానికి 10-12 నిమిషాల సమయం పడుతుంది. వీటిని మయోనీజ్, చిల్లీ సాస్ మిశ్రమంతో నంజుకుని తింటే రుచిగా ఉంటాయి. చక్కని సాయంకాల ఫలహారం ఇది.