జాంబీరెడ్డి, హను-మాన్, మిరాయి వంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్స్లో నటించి సూపర్హీరో ఇమేజ్ని సొంతం చేసుకున్నారు హీరో తేజా సజ్జా. త్వరలో ఆయన మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్తో రాబోతున్నారు. ఆ సినిమానే ‘జాంబీరెడ్డి 2 నెక్ట్స్ లెవెల్’. ఆదివారం తేజా సజ్జా పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీరెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీరెడ్డి’తో జాంబీ ప్రపంచాన్ని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్కు క్రియేటర్గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మింస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఆదివారం టైటిల్ గ్లింప్స్ని విడుదల చేశారు. ఫ్లైఓవర్ పైనుంచి ఓ జాంబీ ట్రక్కుపై పడటం.. ‘జాంబీస్ ఆర్ బ్యాక్’ అనే క్యాప్షన్తో గ్లింప్స్ మొదలైంది. గ్లింప్స్ ఆద్యంతం జాబీలతో పోరాడుతూ తేజా సజ్జా కనిపించారు. ఈ సారి కథ, యాక్షన్, స్కేల్ మరింత ఇంటెన్స్గా ఉండబోతున్నట్టు గ్లింప్స్ చెబుతున్నది. కన్నడ అగ్ర నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో షానాయ కపూర్ కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: గౌర హరి.