ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి క్షమాపణలు కోరారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. శభాష్ రా శంకరా అనే పేరుతో గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు. అలానే కాస్తంత ఘాటుగానే ఓ పోస్ట్ పెట్టారు. దేవునిపై నమ్మకం లేనివారినుద్దేశిస్తూ పెట్టిన ఈ పోస్ట్ పై హేతువాదులు భగ్గుమన్నారు. బాబు గోగినేని వంటి వారు బహిరంగ సవాల్ కూడా విసిరారు. దీంతో వివాదం మరింత ముదరకుండా తనికెళ్ల భరణి స్పందించారు. ఆపోస్ట్ ని తొలగించారు. అనుకోకుండా వచ్చిన నా మాటల వల్ల బాధపడిన వారిని క్షమాపణలు కోరుతున్నానని చెబుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోని పెట్టారు.