జేపీ నవీన్, శ్రావణి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’(ఓ యూనివర్సల్ బ్యాచిలర్). లేలీధర్రావు కోలా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు.
లేలీధర్రావు మాట్లాడుతూ ‘ఇది ఇష్టంతో తీసిన సినిమా. ఈ సినిమాకోసం మా టీమ్ ఎంతో కష్టపడింది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తమకు అవకాశం ఇచ్చినందుకు గాను హీరోహీరోయిన్లు నవీన్, శ్రావణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా అతిథులుగా విచ్చేసిన దర్శకులు వి.సముద్ర, నగేష్ నారదాసి కూడా మాట్లాడారు.