నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. ఈ చిత్రంలోని ‘మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమ..పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా’ అనే గీతాన్ని బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను చిన్మయి ఆలపించింది. విశాల్ చంద్రశేఖర్ స్వరకర్త. నిర్మాత మాట్లాడుతూ ‘నాయకానాయికల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృద్యంగా సాగే గీతమిది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యాలను సమకూర్చారు. సంగీతప్రియులకు చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. నదియా, మురళీశర్మ, అనంత్, కిరీటి దామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: గణేష్కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.