టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది రోజులుగా హెడ్లైన్స్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైతూతో డైవర్స్ తీసుకోబోతుంది అంటూ పలు వెబ్ సైట్ అనేక కథనాలు ప్రచురించడంతో ఈ వార్త వైరల్గా మారింది. దీంతో సామ్ తన సోషల్ మీడియాలో కుక్కపిల్లలను పోస్ట్ చేస్తూ మీడియా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తుందని కామెంట్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సామ్ తనకు సంబంధించి ఓ ఫొటో షేర్ చేసింది. ఇందులో ఫ్రెండ్స్తో సైకిల్ పై చక్కర్లు కొడుతూ సంతోషంగా కనిపించింది. సామ్ తో పాటు ఆమె క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇది చెన్నైలో దిగిన ఫొటోనా లేదంటే ఏదైన టూర్కి వెళ్లినప్పటి ఫొటోనా అన్నది తెలియాల్సి ఉంది.
సమంత కెరీర్ విషయానికి వస్తే ఈ అమ్మడు ఆ మధ్య ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమాలో సమంత నటనకు అవార్డ్ కూడా దక్కింది. అలానే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. తాజాగా నయనతార, విజయ్ సేతుపతితో ప్రధాన పాత్రలలో విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న “కాతు వాకుల రెండు కాదల్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.