Parineeti Chopra | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)ల వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ వివాహం తరువాత పరిణీతి చోప్రా తన ఫ్యామిలీ & ఫ్రెండ్స్తో కలిసి వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ మాల్దీవులకు వెళ్లింది. తన ఫ్రెండ్స్తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిణీతి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
భర్త రాఘవ్ చద్దాతో కలిసి హనీమూన్కు వెళ్లకుండా తన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కలిసి మాల్దీవులకు వెళ్లింది పరిణీతి. ఇక ఇందులో పరిణీతి అమ్మతో పాటు అత్తగారు కూడా ఉన్నారు. అందరు కలిసి బీచ్లో ఎంజాయ్ చేస్తున్న ఓ అందమైన ఫోటోను పరిణీతి షేర్ చేసింది.
మా అమ్మ & అత్తగారితో అలాగే మా గ్యాంగ్తో కలిసి టూర్కు వెళ్లడం ఇది ఒక మధురమైన అనుభూతి. మాకు ఆతిథ్యమిచ్చినందుకు ఈ ప్రదేశానికి ధన్యవాదాలు. మేము మళ్లీ తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాము అంటూ పరిణీతి చోప్రా ఇన్స్టాలో రాసుకోచ్చింది.