S.S Rajamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రామలు జరుపుకున్నట్లు తెలుస్తుంది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మహేశ్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవ్వగా.. ప్రైవేట్గా ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేసినట్లు తెలుస్తుంది.
హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. యాక్షన్ అడ్వెంచర్గా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.