సెకండ్ వేవ్లో కరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలా మంది కరోనా బారిన పడ్డారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ చేస్తున్నప్పటికీ, కొందరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ తమ దగ్గర పని చేసే వారికి కరోనా సోకడంతో క్వారంటైన్కు వెళ్లారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కూడా ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు.
బిగ్బాస్ 2 సీజన్ విన్నర్ కౌశల్కు సైతం కరోనా భయం పట్టుకుంది. తన డిజైనర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. వర్క్ బిజీతో నెల రోజులుగా ఫ్యామిలీకి దూరంగా ఉన్న కౌశల్ ఇప్పుడు వారిని కలిసే ముందు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేసిన కౌశల్ రిపోర్ట్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.