కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో కలిసి ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పెళ్లైన తర్వాత కూడా కాజల్ వరుస ఆఫర్స్తో దూసుకుపోతుంది. ప్రస్తుతం కాజల్ కెరియర్ పీక్స్లోనే ఉండగా, ఈ అమ్మడు తన భర్త గౌతమ్ కిచ్లు, చెల్లి నిషా అగర్వాల్ ని టాలీవుడ్కి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తుందట.
కాలజ్ సోదరి నిషా ఇప్పటికే వెండితెరకి పరిచయం కాగా, ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో మెల్లగా ఆమెకు ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో పెళ్లి చేసుకున్న నిషా అగర్వాల్ బాబుకు జన్మను ఇచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్స్ కు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వరు అనే టాక్ ఉంది. కాని ఈమద్య కాలంలో ఓటీటీ ల వల్ల ప్రతి ఒక్కరికి ఆఫర్లు దక్కుతున్నాయి.కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా ఓటీటీ కంటెంట్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది.
రానా మరియు వెంకటేష్ లు కలిసి నటించబోతున్న వెబ్ సిరీస్ లోని కీలక పాత్రకు గాను నిషాను ఎంపిక చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తుంది.ఈ ఆఫర్ వెనుక కాజల్ హస్తం ఉందట. ఈ వెబ్ సిరీస్ హిట్ అయితే నిషాకి హీరోయిన్ ఆఫర్స్ కూడా వస్తాయని అంటున్నారు. మరోవైపు కాజల్.. తన భర్త గౌతమ్ కిచ్లుని కూడా హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.