Geetha Govindam-2 On Cards | అదేంటో ఒక్కోసారి ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన సినిమా కూడా నిర్మాతల పాలిట కాసులు కురిపించే లక్ష్మీ దేవిలా మారుతుంది. అలాంటి సంచలనం నమోదు చేసిన సినిమా ‘గీత గోవిందం’. ఐదేళ్ల కిందట ‘అర్జున్రెడ్డి’ క్రేజ్ తప్పితే పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన గీత గోవిందం నిర్మాతలకు కాసులు వర్షం కురిపించింది. అర్జున్ రెడ్డిలో యాంగర్ మేనేజ్మెంట్ పాత్ర పోషించిన విజయ్.. ఉన్నట్టుండి గీతాగోవిందం కోసం ఇన్నోసెంట్ పాత్రలో కనిపించడం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంతేకాదండోయ్.. రష్మిక, విజయ్ల కెమిస్ట్రీకు కూడా పట్టం కట్టారు. ఎంతలా అంటే తిరిగి మళ్లీ ‘డియర్ కామ్రేడ్’ కలిసి చేసేంతలా.
రిలీజ్కు ముందు అంతంత బజ్తో ఉన్న సినిమాపై ఇంకేం కావాలి అనే పాటతో ప్రేక్షకుల చెవిలో నూనే పోసినంత హాయినిచ్చారు. ఈ ఒక్క పాట సిద్ శ్రీరామ్కు టాలీవుడ్లో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టింది. పరుశురామ్కు దర్శకుడిగా పదేళ్ల పాటు రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో ఏకంగా మహేష్తో సినిమా చేసే చాన్స్ దక్కింది. ఒక సింపుల్ లవ్స్టోరీతో సరికొత్త రికార్డులు తిరగరాయచ్చు అని తన కథనంతో నిరూపించాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడీ క్లాసిక్కు సీక్వెల్కు తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
గీతాఆర్ట్స్ బ్యానర్ నుండి పరుశురామ్కు ఇటీవలే ఓ ఫోన్ కాల్ వెళ్లిందని, గీత గోవిందం సీక్వెల్కు కథ రెడీ చేయమని చెప్పినట్లు టాక్. సీక్వెల్స్ బాగా వర్కవుట్ అవుతున్న ట్రెండ్లో గీత గోవిందంపై నిర్మాతలు మనసు పడటం మంచి ఐడియానే. కానీ ఈ సీక్వెల్స్పై ఓ రేంజ్లో అంచనాలుంటాయి. పైగా రష్మిక, విజయ్ కలిసి నటిస్తున్నారంటే గాసిప్ ప్రియులకు పండగే. ఐదేళ్ల కిందట రూ.15 కోట్ల ప్రీ బిజినెస్ జరుపుకున్న గీతాగోవిందం ఏకండా రూ.75 కోట్ల వరకు షేర్ను రాబట్టి సంచలనాన్ని సృష్టించింది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మరోవైపు రష్మిక పుష్ప సీక్వెల్తో బిజీగా ఉంది. ఇక మహేష్తో సర్కారువారి పాట లాంటి పెద్ద సినిమా చేసినా.. ఇప్పటి వరకు మరో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించలేకపోతున్నాడు పరుశురామ్. ఆ మధ్య నాగచైతన్యతో ప్రాజెక్ట్ లాక్ అయినట్లు వార్తలు వచ్చినా.. మళ్లీ దాని గురించి ముచ్చటే లేదు.