బాలకృష్ణ నటించిన ‘ధర్మక్షేత్రం’ చిత్రంలోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ పాట చక్కటి మెలోడీగా సంగీత ప్రియుల హృదయాల్ని దోచుకుంది. ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గాత్రం ఆ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాటను కల్యాణ్రామ్ తాజా చిత్రం ‘అమిగోస్’లో రీమిక్స్ చేశారు. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మంగళవారం ఈ సినిమాలోని ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ రీమిక్స్ గీతాన్ని విడుదల చేశారు. కల్యాణ్రామ్, ఆషికా రంగనాథ్ మధ్య అందమైన రొమాంటిక్ మెలోడీగా ఈ పాటను దృశ్యమానం చేశారు. ఎస్పీ చరణ్, సమీర భరద్వాజ్ ఆలపించారు. కనులవిందైన విజువల్స్తో ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో కల్యాణ్రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు.