హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పలువురు సినీ స్టార్స్కు ఈడీ సమన్లు జారీచేసింది. సినీ స్టార్స్ చార్మి, రకుల్ప్రీత్సింగ్, రాణా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్ఖాన్, నందు, శ్రీనివాస్కు ఈడీ సమన్లు పంపించింది.
టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసుతో వెలుగులోకి వచ్చాయి. హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తరువాత టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతని సెల్ఫోన్లో లభించిన ఆధారాలను అనుసరించి దర్యాప్తు ప్రారంభమైంది. ఈ క్రమంలో స్పెషల్ సెల్ పోలీసుల విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను సైతం పోలీసులు సేకరించి పరీక్షలకు పంపించారు. విచారణ అనంతరం 2 జులై, 2017న 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది.