పునీత్ రాజ్కుమార్ కథానాయకుడిగా అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘ద్విత్వ’. పవన్కుమార్ దర్శకుడు. విజయ్ కిరగందూర్ నిర్మాత. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ మొదలుకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. ద్విత్వ అంటే ఓ వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించడం. ఓ వ్యక్తి తనలోని మరో వ్యక్తిని ఎలా కనుగొన్నాడన్నదే చిత్ర కథాంశం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పునీత్ రాజ్కుమార్ మేనరిజమ్స్కు చక్కగా సరిపోయే కథ ఇది’ అన్నారు. ఇప్పటివరకు పునీత్రాజ్కుమార్ నటించిన చిత్రాలకు భిన్నంగా ఉండే చిత్రమిదని, విభిన్నమైన థ్రిల్లర్గా అలరిస్తుందని నిర్మాత తెలిపారు.