సీనియర్ నటుడు శరత్బాబు తనయుడు ఆయుష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘దక్ష సెక్షన్ 302’. అఖిల్, పవన్, అను, నక్షత్ర, రియా ఇతర ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. వివేకానంద విక్రాంత్ దర్శకుడు. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ‘థ్రిల్లర్ జోనర్లో వైవిధ్యమైన కథ, కథనాలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఖమ్మం, అరకు, హైదరాబాద్లో చిత్రీకరణ చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి రచన: శివ కాకు, సంగీతం: వీఆర్ఏ ప్రదీప్.