న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్పోర్ట్స్ బైకును విడుదల చేసింది యమహా మోటర్. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఫ్జెడ్ 25 మోడల్ విభాగంలో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,36,800గా నిర్ణయించింది. ఈ నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అవుట్లెట్లలో ఈ బైకు లభ్యమవనువుతుంది.