హైదరాబాద్, జూన్ 25: స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్..తాజాగా ఏఐ డాటాసెంటర్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఈ విభాగంలో ఇప్పటికే సేవలు అందిస్తున్న జీస్కేల్ ఎనర్జీలో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. మొదటి ఫేజ్లో భాగంగా రూ.190 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు స్టాండర్డ్ ఇంజినిరింగ్ ఎండీ నాగేశ్వర రావు తెలిపారు.
భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నూతన వర్టికల్ నుంచి రూ.250 కోట్ల ఆదాయం అంచనావేస్తున్నట్టు చెప్పారు.