LIC Jeevan Dhara II | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. తన పాలసీదారుల కోసం కొత్త పెన్షన్ ప్లాన్ ‘జీవన్ ధార-2’ తెచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్, పొదుపు, డిఫర్డ్ యాన్యుటి ప్లాన్. సోమవారం నుంచి పాలసీ సేల్స్ మొదలయ్యాయి. కస్టమర్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లోనూ ఈ పాలసీ తీసుకోవచ్చు. 11 ఆప్షన్లతో వస్తున్న ఈ పాలసీ డిఫర్మెంట్ పీరియడ్లోనూ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. రెగ్యులర్ ప్రీమియంగా, సింగిల్ ప్రీమియం ఆప్షన్గా గానీ ఎంచుకోవచ్చు.
మలి దశలో పెన్షన్ కోరుకునే వారి కోసం ఎల్ఐసీ డిజైన్ చేసిన పెన్షన్ పథకం జీవన్ ధార-2. ఎక్కువ పెన్షన్ కావాలనుకుంటే ఎక్కువ యాన్యుటీ కొనుగోలు చేయాలి. ఒక్కరితోపాటు ఇద్దరి పేరిట కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో చేరడానికి 20 ఏండ్ల వయస్సు గల వారు అర్హులు. యాన్యూటీ ఆప్షన్తోపాటు గరిష్ట వయస్సు అర్హత ఉంటది. ఏడాది నుంచి 15 ఏండ్ల డిఫర్ మెంట్ పీరియడ్ ఉంటది.
60 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వయస్సు వరకూ ఈ పాలసీ తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం.. నెల లేదా మూడు నెలలు/ ఆరు నెలలు/ ఏడాదికోసారి ప్రీమియం పే చేయొచ్చు. 11 రకాల ఆప్షన్లతో వస్తున్న జీవన్ ధార-2 పాలసీలో రెగ్యులర్, సింగిల్ ప్రీమియం పేమెంట్ కోసం వేర్వేరు ఆప్షన్లు ఉంటాయి. సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లూ ఉంటాయి.