పూణె, డిసెంబర్ 27: ఇటలీకి చెందిన ఆటో దిగ్గజం పియాజియో కూడా తన వాహన ధరలను పెంచింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను రూ.6 వేల వరకు సవరిస్తున్నట్టు తెలిపింది.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో డీజిల్, సీఎన్జీ, ఎల్పీజీ, పెట్రోల్ రకాల్లో లభించనున్న కార్గో, ప్యాసింజర్ అపే ఆటోలు రూ.6 వేల వరకు ప్రియం కానున్నాయి.