ముంబై, జూలై 11: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో.. దేశవ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి టాప్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో జట్టుకట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చును. ఈ శిక్షణ కేంద్రాలతో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యం మెరుగపడనున్నదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ శిక్షణలో భాగంగా నాలుగు కీలక మాడ్యుల్స్పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. వీటిలో ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ తయారీ, సెన్సార్ టెక్నాలజీ, రోబోటిక్స్, మోషన్ కంట్రోల్పై ప్రధానంగా దృష్టి సారించనున్నది.