న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో న్యూ జాగ్వర్ ఎఫ్-పేస్ ఎస్వీఆర్ను జాగ్వర్ ల్యాండ్ రోవర్ లాంఛ్ చేసింది. ఈ కారు రూ 1.51 కోట్ల (ఎక్స్షోరూం-ఇండియా)కు అందుబాటులో ఉంటుంది. న్యూ ఎఫ్-పేస్ ఎస్వీఆర్ కేవలం నాలుగు సెకండ్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిమీ వేగం అందుకుంటుంది.
ఇంటెలిజెంట్ డ్రైవ్లైన్ డైనమిక్స్తో కూడిన జాగ్వర్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టంతో ఈ వాహనం కస్టమర్లను ఆకట్టుకోనుంది. కంఫర్ట్, డైనమిక్ మోడ్స్లో ఎఫ్-పేస్ ఎస్వీఆర్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. నూతన వాహనంలో విశాలమైన క్యాబిన్ స్పేస్ను జోడించారు. రెడ్ స్టిచింగ్తో లెదర్తో కూడిన స్టీరింగ్ వీల్, వైర్లెస్ చార్జర్, 11.4 ఇంచ్ కర్వ్డ్ గ్లాస్ హెచ్డీ టచ్స్క్రీన్, న్యూ పివి ప్రో ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం వంటి హాట్ ఇంటీరియర్స్ ఆకట్టుకుంటాయి. ఇక జాగ్వర్ ఎఫ్-పేస్ ఎస్వీఆర్ బుకింగ్స్ ఈ ఏడాది జూన్ నుంచే ప్రారంభం కాగా డెలివరీ డేట్స్ను కంపెనీ ప్రకటించనుంది.