(Mansas Lands Issue) విజయనగరం: మన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆలయ ఈఓ ఫిర్యాదుతో సమస్య విజయనగరం జిల్లా కలెక్టర్కు చేరింది. దాంతో మరోసారి వివాదం రాజుకున్నట్లయింది. ట్రస్టు అనుమతి లేకుండా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో మన్సూస్ ట్రస్ట్ ఆస్తులను సర్వే చేశారని, దాంతో ఈ విషయాన్ని కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఫిర్యాదు చేసినట్లు ఈఓ తెలిపారు.
కోట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పబ్లిక్ పార్కింగ్కు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారని, మున్సిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే సదరు ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిన్నారని కలెక్టర్కు రాసిన లేఖలో ఈఓ ఆరోపించారు. మన్సాస్ ట్రస్ట్ ఆస్తులకు రక్షణ కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ప్రస్తుతం మన్సాస్ ట్రస్టుకు చెందిన ఖాళీ స్థలంలో ప్రైవేట్ సెక్యూరిటీ కాపలా కాస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే వీరభద్రస్వామి అనుచరులు, వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత అశోక్గజపతి రాజు ఆదేశాల మేరకే ఎమ్మెల్యేపై ఈఓ ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు.