విజయవాడ: ఇంటర్మీడియెట్ ప్రైవేట్ అభ్యర్థులు తత్కాల్ పథకం కింద పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పెంచింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్బోర్డు తాజా ఉత్తర్వుల్లో ప్రకటించింది.
తత్కాల్ కింద రూ.1300, అటెండెన్స్ మినహాయింపు ఫీజు రూ.1300, మొదటి ఏడాది పరీక్ష ఫీజు రూ.500, రెండో ఏడాది పరీక్ష ఫీజు రూ.500 గా ఉన్నదని ఇంటర్బోర్డు కార్యదర్శి శేషగిరి తెలిపారు. ఫీజులకు సంబంధించిన చలానాలను ఫిబ్రవరి 2లోపు ఆన్లైన్లో తీయాలని, నాలుగో తేదీలోగా ఆర్ఐవో కార్యాలయాల్లో సమర్పించాలని ఆయన సూచించారు.