బాధితుడి మెదడుపై కూడా వైరస్ ప్రభావం
ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ మానవ శరీరంలో ఉందనడానికి దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తి తగ్గడం కూడా ఒక లక్షణమేనని ప్రముఖ న్యూరోసర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథం చెప్పారు. వైరస్ ప్రభావం మెదడుపై పడటం వల్ల ఉదయం లేవగానే ఏ పని చేయాలనిపించకపోవడం, ఏదీ గుర్తుండకపోవడం, చికాకు వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. నిద్రలేమితోపాటు మానసిక సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ముందే గుర్తించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే వైరస్ చాలామందికి వ్యాపించే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఆదివారం ఆయన
‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. కరోనా సోకినవారిలో ముందుగానే రుచి, వాసన పోతుందని చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తి ముక్కు రంధ్రాలు, గొంతులో పలుచని నరాలు పనిచేయవని, మల్ల్లెపువ్వు వాసన కూడా తెలియదని తెలిపారు. ఇదంతా దగ్గు, జలుబు, జ్వరం లేకుండా వైరస్సోకిన వ్యక్తి శరీరంలో ఉండే లక్షణాలని, అలాంటి వాళ్లు హోంఐసొలేషన్లోకి వెళ్లాలని సూచించారు. వెంటిలేషన్పై ఉన్న కొందరు కొవిడ్ పేషెంట్లకు స్టెరాయిడ్లు ఎక్కించడంతో కంటిచూపు తగ్గుతుందని, కొందరిలో కనురెప్పలపై బొబ్బలు, విపరీతమైన నొప్పి వంటివి వస్తాయని తెలిపారు. మరికొందరి మానసిక ధైర్యం సన్నగిల్లి, త్వరగా డిప్రెషన్కు గురవుతున్నారని పేర్కొన్నారు.