న్యూఢిల్లీ: ఢిల్లీకి కేటాయించిన ఆక్సిజన్ కోటాను సరఫరా చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మీద ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే కొవిడ్ చికిత్సలో రెమ్డెసివిర్ వినియోగంపై చేసిన మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆక్సిజన్తో చికిత్స పొందుతున్న రోగులకే రెమ్డెసివిర్ ఇవ్వాలన్న ప్రొటోకాల్ను తప్పుబట్టింది. దీని వల్ల ఆక్సిజన్ లేని రోగులకు రెమ్డెసివర్ అందదని పేర్కొన్నది. ప్రజలను వారి చావుకు వారిని వదిలేసినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది.