హైదరాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భాగంగా గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.8లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇ వ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 15 లక్షల నోటీసులు మాత్రమే సిద్ధమయ్యాయి. వాటిలో కేవలం 650 మందికే నోటీసులు అందినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. మరో రెండు రోజుల్లో పంపిణీ వేగం పుంజుకుంటుంద ని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్తోపాటు చాలా ప్రాంతాల్లో నోటీసుల పం పిణీ ఇంకా ప్రారంభం కాలేదు. ‘సర్’లో భాగంగా ఈ నెల 17న ముసాయిదా ఓట ర్ల జాబితా ప్రచురించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 92.8లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని గుర్తించారు.
వీరిలో 60.5లక్షల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్స్లో వివిధ రకాల అసమానతలు ఉ న్నట్టు గుర్తించారు. మరో 32.3 లక్షల మంది ఓటర్ల వివరాలను 2002నాటి ‘సర్’ జాబితాతో మ్యాప్ చేయలేకపోయినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 12.5 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉన్న ది. వీరిలో 5,80,908 మంది ఓటర్ల వివరాలు 2002 ‘సర్’ జాబితాతో మ్యాప్ కాలేదు. మరో 6,72,678 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్స్లో అసమానతలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 23.26 లక్షల మంది ఓటర్లను అన్మ్యాప్డ్ గా గుర్తించడం పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది. నోటీసుల భాష విషయంలోనూ స్పష్టతకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్లో నమోదైన వివరాల్లో అనుమానాస్పద లేదా అసాధారణమైన తేడాలు కనిపిస్తే అనామలిస్ నోటీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యం గా కుటుంబసభ్యుల మధ్య వయస్సు వ్యత్యాసాలు అసాధారణంగా ఉండటం, తోబుట్టువుల మధ్య తొమ్మిది నెలల కంటే తకువ వ్యవధి ఉండటం, తల్లిదండ్రులు-పిల్లల మధ్య 15 ఏండ్ల కంటే తకువ లేదా 50 ఏండ్ల కంటే ఎకువ వయస్సు వ్యత్యాసం ఉండటం, తాత-మనుమమం డ్ల మధ్య 40ఏండ్ల కంటే తకువ వయస్సు తేడా ఉండటం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. 2002 నాటి ‘సర్’ ఓటర్ల జాబితాలోని వివరాలతో ప్రస్తుత ఎన్యుమరేషన్ ఫామ్లోని సమాచారం సరిపోకపోయినా నోటీసులిస్తున్నారు. తల్లిదండ్రుల పేర్లలో తేడా, బంధుత్వ వివరాల్లో మా ర్పు, ఒకే ఓటరుకు వేర్వేరు తం డ్రుల పేర్లు నమోదై ఉండటం, వయస్సు లో అసమానతలు, పేర్లు లేదా కుటుంబ సంబంధాల్లో వ్యత్యాసాలు వంటి అంశాలు కూడా నోటీసులకు కారణమవుతున్నాయి.
నోటీసులు, క్లెయిమ్స్, అబ్జెక్షన్ల పరిష్కారానికి అక్టోబర్ 15వ తేదీ గడువుగా ప్రకటించారు. అయితే, ఈలోపు 92.8 లక్షల మంది ఓటర్లకు నోటీసుల జారీ, పరిష్కారం సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.