హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి చండీగఢ్లో పర్యటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాల స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు.. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే విధానాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక పరిశీలకుడిగా వెళ్లారు. అతడితో పాటు ప్రత్యేక పరిశీలకులుగా నియమింపబడిన హర్యానా, తెలంగాణ, పుదుచ్చేరి, కేరళ, గోవా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు శుక్రవారం చండీగఢ్ లో సమావేశమయ్యారు.
ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఈ ఎన్నికలు జరగడానికి చండీగఢ్ ఎన్నికల కమిషన్ తీసుకున్న పలు చర్యలపై చర్చించారు. తర్వాత పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగు సరళిని పరిశీలించి తమ సంతృప్తిని వ్యక్తం చేవారు.
కొన్ని డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్, కౌటింగ్ కేంద్రాలను కూడా సందర్శించి అక్కడి ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సెక్యూరిటీ స్థాయి వివరాలను సంబంధిత జిల్లా అధికారులను అడిగి తెలుసుకొన్నారు.