హైదరాబాద్ : శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని అచ్చంపేట మండలం చెన్నారం గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాతపడగా.. ఆర్టీసీ బస్సు దహనమైంది. స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం.. బుధవారం సాయంత్రం వెల్లటూరు గ్రామం నుంచి సాయిబాబా అనే వ్యక్తి మద్యం సేవించి బైక్పై అచ్చంపేటకు వస్తుండగా.. శ్రీశైలం నుంచి సంగారెడ్డికి వెళ్తున్న సమయంలో చెన్నారం గేట్ వద్ద ముందున్న ఆటోను క్రాస్ చేసి ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది.
ప్రమాదంలో బైక్ బస్ కింద నుంచి రోడ్డును రాసుకుంటూ వెళ్లడంతో బస్సులో మంటలు చెలరేగడంతో బస్ పూర్తిగా దగ్ధమైంది. సాయిబాబా ముఖం రోడ్డును రాసుకుంటూ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బస్ వెనుకాల వస్తున్న ఆటో అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా.. ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.